కృష్ణ పరమాత్మ ఎప్పుడు నెమిలిపించం ధరించి కనిపిస్తాడెందుకు?


ఓం నమో భగవతే వాసుదేవాయ
శ్రీ కృష్ణ పరమాత్మ ఎప్పుడు నెమిలిపించం ధరించి కనిపిస్తాడెందుకు?
ఈ సమస్త సృష్టిలో శారీరిక సంపర్కం లేకుండా సంతానం పొందగలిగేది ఒక్క నెమలి మాత్రమేనటుంది శాస్త్రం. మగనెమలికి పించం ఉంటుంది. మేఘాలు పట్టి వర్షం పడే సమయంలో మగనెమలి ఆనందంతో నాట్యం చేస్తుంది, ఆ సమయంలో మగనెమలి కంటి నుంచి పడే బిందువులను ఆడనెమలి వచ్చి త్రాగుతుంది. ఆ నీటిని త్రాగడం చేత ఆడనెమలి గర్భం ధరిస్తుందట. ఎటువంటి శారీరిక సంబంధం లేకుండా జరుగుతుంది ఈ ప్రక్రియ. శ్రీ కృష్ణుడు యోగి. ద్వాపరయుగంలో భూమిపై తిరగాడిన సిద్ధపురుషుడు. అటువంటి శ్రీ కృష్ణుడు తనకు అందరితో ఉన్నది ఆత్మ సంబంధమేనని, ఎవరితోనూ తనకు శారీరిక సంబంధం లేదని, తాను ఒక యోగినని తెలుపడానికే నెమలి పించం ధరించి కనిపిస్తాడు.
ఓం నమో భగవతే వాసుదేవాయ

Comments

Popular posts from this blog

నూతన యజ్ఞోపవీత ధారణ విధి & నిత్య త్రికాల సంధ్యా వందనము

Jambu dweepe bharata varshe Abstract

ఉపనయనము: