Posts

Yajurvedam in Telugu

Yajur Vedam In Telugu

శివాభిషేక ఫలములు

ఓంకార స్వరూపుడైన శివుడు లోకహితం కోసం ఎన్ని రూపాలు ధరించాడు.....!!ఈ విషయంపై శివపురాణం ఓసారి తిరగేస్తే.. అందులో శివుడు ఎనిమిది రూపాలు ధరించినట్టు పేర్కొంటోంది.అవేంటంటే...రుద్రుడు : దుఃఖ నివారకుడైన అగ్నిని అధిష్టించి ఉంటాడు.శర్వుడు : జీవుల మనుగడ కోసం భూమిని అధిష్టించి ఉంటాడు.భవుడు : ఈ జగానికి అత్యంతావశ్యకమైనజలాన్ని ఆశ్రయించి ఉంటాడు.ఉగ్రుడు : జగత్తు కదలికలకు కారకుడైన వాయువును అధిష్టించి ఉంటాడు.భీముడు : ఆకాశాన్ని ఆశ్రయించి ఉంటాడు.పశుపతి : సంసారబద్ధులైన జీవులను పాపవిముక్తులను చేసేం దుకై జీవాత్మను అధిష్టించి ఉంటాడు.ఈశానుడు : ఈ చరాచర జీవులను శాసించే సూర్యునిలో ప్రకాశిస్తుంటాడు.మహాదేవుడు : తన చల్లని కిరణాలతో జీవులను పాలించు చంద్రునిలో ప్రకాశిస్తుంటాడు.శివాభిషేక ఫలములు......1 గరిక నీటితో శివాభిషేకము చేసిన నష్టమైన ద్రవ్యము తిరిగి పొందగలడు.2 నువ్వుల నూనెతో అభిషేకించిన అపమృత్యువు నశించ గలదు.3 ఆవు పాల అభిషేకం సర్వ సౌఖ్యములను ప్రసాదించును.4 పెరుగుతో అభిషేకించిన బలము, ఆరోగ్యము, యశస్సు లభించును.5 ఆవు నేయితో అభిషేకించిన ఐశ్వర్య ప్రాప్తి కలుగును6 చెరకు రసముతో అభిషేకించిన ధన వృద్ది కలుగును.7 మెత్తని చేక్క...

నమకం విశిష్టత

నమకం విశిష్టత ........!!!నమకం, చమకం 11 భాగాలు ఉంటాయి. ఒకొక్క భాగాన్ని "అనువాకం" అంటారు. మొదటి అనువాకంలో పరమశివుడినితన రౌద్ర రూపాన్ని చలించి, తన అనుచరులను, ఆయిదాలను త్యజించమని ప్రసన్నము చేసుకుంటూ ప్రార్ధించేది. శాంతించిన స్వామిని దయతల్చమని ప్రార్ధించు భావం ఉంది. ఈ పంక్తులలో ఎన్నో నిగూఢమైన రహస్యాలు దాగి ఉన్నాయి. కొన్ని ఆయుర్వేద మందులు తయారుచేయు విధానాలు కూడా కనిపిస్తాయి.అనువాకం – 1:తమ పాపాలను పోగొట్టి, ఆధిపత్యాన్ని, దైవం యొక్క ఆశీర్వచనం పొందేట్టుగా, చేసి, క్షామం, భయం పోవునట్టు చేసి, ఆహార, గోసంపద సమృద్ధి గావించి, గోసంపదను చావునుండి, ఇతర జంతువులనుండి, జబ్బులనుండికాపాడుతుంది. జ్వర బాధ, జబ్బులు, పిండ-మరణాలు, చెడు కర్మ, నక్షత్ర చెడు ప్రభావాలను తప్పించి, కోర్కెలు తీర్చి, సకాలంలో వానలు కురిపించి, కుటుంబాన్ని పరిరక్షించి, సంతానాన్ని ఆశీర్వదించి, ఐహిక సుఖాలను ప్రసాదించి, శత్రువులను నాశనంచేస్తుంది.అనువాకం – 2 :ప్రకృతిలో, సర్వ ఔషధములలో సర్వాంతర్యామి అయిన రుద్రుడికి సంసార బంధాలను సడలించమని ప్రార్ధన.. శత్రు వినాశనానికి, సంపద మరియు రాజ్యప్రాప్తికి, జ్ఞాన సాధనకు ఈ అనువాకాన్ని చదువుతారు.అనువాక...

vedas

1 The Four Vedas Rigveda contains mainly mantras in praise of various vedic deities and prayers to them. It is divided in two ways. 8 ashtakas comprising of 64 adhyayas ORversesverses 10 mandalas comprising of 85 anuvakas in total there are 1028 suktams made up of 10552 mantras. A suktam is a collection of mantras on a particular subject. Originally there were 21 branches of this veda, but now only to i.e.:- Bhashkala and Sakala are in existing. The sub texts of this veda are Brahmanas ( procedural instructions) - Kaushitaki, Sangrayana and Aithareya Aranyakas - Kaushitaki and Aithareya Upanishads - Kaushitaki and Aithareya Gruhya sutra - Asvalayana Yajurveda There are two schools of yajurveda. The shukla yajurveda and the krishna yajurveda. The main difference is that in shukla yajurveda we find mantras alone whereas krishna yajurveda is a mix of mantras and the relevant brahmana bhaga also. Yajurveda consists mainly of procedural mantras used in yajnas and it is ...

బోగి పండ్లు

బోగి పండ్లురేగు పళ్ళని సంస్కృతంలో బదరీ ఫలాలంటారు. పూర్వం నర నారాయణులు బదరీ వనంలో తపస్సు చేశారు. అక్కడ తపస్సు చేసుకుంటూ వాళ్ళు రోజూ చుట్టుపక్కలవున్న చెట్లనుంచి ఒక్క రేగు పండుని ఆహారంగా తీసుకునే వాళ్లు. సాక్షాత్తూ నారాయణుడు అక్కడ తిరుగుతూ, రేగు పళ్ళని తింటూ, ఆ ప్రదేశాల్నీ, వృక్షాలనీ, వనాన్నీ స్పృశించి ఆశీర్వదించారు. ఆ ప్రదేశమే బదరీ క్షేత్రం.బదరీ ఫలాలు నారాయణుడిచే స్పృశించబడి సాక్షాత్తూ ఆ దేవ దేవుని ఆశీస్సులు పొందాయి కనుక ఆ పళ్ళను ఎవరు వాడినా సిరిసంపదలు, భోగ భాగ్యాలతో తులతూగుతార ంటారు. భోగినాడు పెద్దవారుపిల్లలకి భోగి పళ్ళుపోసి ఆశీర్వదిస్తారు. వారి ఆశీర్వచనాలతోబాటు ఆనారాయణుడి ఆశీస్సులు కూడా వారికి అందుతాయనే నమ్మకంతో.రేగి పండు భారత ఇతిహాసంలో…. భారత నాగరికతలో….. పూజలలోను పాలు పంచుకున్న అతి కొద్ది పండ్లలో రేగి పండు ఒకటి. రేగిపండును బదరీ ఫలం అంటారు. రామాయణంలో శబరి శ్రీరామునికి తినిపించింది ఈ ఫలాలనే. సంక్రాంతి నాడు బోగి పండ్లు పోయాలి అని అంటుంటారు అవి కూడ రేగి పండ్లే.సంక్రాంతి పండుగకు వచ్చే ముందురోజున “భోగి” పండుగ జరుపుకుంటాం. సూర్యుడు ఒక రాశి నుంచి ఇంకో రాశిలోకి ప్రవేశించే ముందు రోజునే భోగి అం...

గోమతిచక్రాలు

అరుదైన సహజసిధ్ధంగాలభించే సముద్రపు ఉత్పత్తి. గోమతిచక్రాలు గుజరాత్ రాష్ట్రం నందు ద్వారకలోని గోమతి ది నందు లభిస్తాయిగోమతిచక్రం శ్రీకృష్ణుని చేతిలోని సుదర్శన చక్రాన్ని పోలి ఉంటుంది.దీనినే “నాగ చక్రం” అని “విష్ణు చక్రం” అని కూడ అంటారు. ఇది నత్త గుళ్ళ ని పోలి ఉంటుంది.అందువల్ల దీనిని “నత్త గుళ్ళ “స్టోన్ అని కూడ అంటారుగోమతిచక్రాలు అన్నిరకాల పూజా కార్యక్రమాలకి,సకల కార్యసిధ్ధికి,ఆరోగ్య సమస్యలకి,ధరించటానికి ఉపయోగపడతాయి.ఎర్రగాఉన్న గోమతిచక్రాలు వశీకరణానికి,శత్రునాశనానికి,క్షుద్రప్రయోగాలకి,తాంత్రిక ప్రయోగాలకి మాత్రమేఉపయోగించాలి.గోమతిచక్రాలలో ఆరు,తొమ్మిది సంఖ్యలు అంతర్లీనంగా దాగి ఉన్నాయి . సంఖ్యాశాస్త్రంలో ఆరు శుక్ర గ్రహానికి,తొమ్మిదికుజ గ్రహానికి చెందుతాయి.జాతకంలో కుజ శుక్రులు బలహీనంగా ఉన్నప్పుడు ప్రేమలోవిఫలం కావటం,వివాహాం అయిన తరువాతరతికి ఆసక్తిని కనబర్చకపోవటం వంటి దోషాలు సైతం గోమతిచక్ర ధారణవల్లనివారించబడతాయి.పూజా విధానం:-గోమతి చక్రాలను సిధ్ధం చేసుకున్న తరువాత వాటిని ముందుగా గంగాజలం నీళ్ళతో గాని పసుపు నీళ్ళతో గాని కడిగి పరిశుబ్రమైన బట్టతోతుడవాలి.గోమతిచక్రాలను శ్రీయంత్రం లేదా అష్ట లక్ష్మీ యంత్రం గాన...

ఉత్తరాయణం

ఈ నెల 15 నుండి ఉత్తరాయణం మొదలవుతోంది....ఉత్తరాయణం పుణ్యకాలం అంటే దక్షిణాయణం పాప కాలం అని అర్ధం చేసుకో కూడదు. దక్షిణాయణం కూడా పుణ్య కాలమే..అయితే ఉత్తరాయణం విశిష్టత వేరు…ఆయనం అనగా పయనించడం అని అర్ధం.ఉత్తర ఆయనం అంటే ఉత్తర వైపుకి పయనించడం అని అర్ధం.సూర్యుడు భూమికి కొంత కాలందక్షిణం వైపు పయనించడంతరువాత దక్షిణం వైపు నించిఉత్తరం వైపుకి పయనించడం జరుగుతూ ఉంటుంది.సూర్యుడు పయనించే దిక్కుని బట్టి దక్షిణం వైపుకి పయనిస్తున్నపుడుదక్షిణాయణం అని ఉత్తరం వైపుకి పయనిస్తున్నప్పుడు ఉత్తరాయణం అని అం టారు.సూర్యుడు పయనించే దిక్కును బట్టి భూమిపై వాతావరణంలోమార్పులు సంభవిస్తుంటాయి.సూర్యుడు సంవత్సరంలో ఆరు నెలలు ఒక వైపుఅనగా దక్షిణం వైపు మరో ఆరు నెలలు ఒక వైపు అనగా;ఉత్తరం వైపు పయనిస్తూ ఉంటాడు.సాధారణం గా ఉత్తరాయణం జనవరి 15 నుండి జూలై 17 వరకు వుంటుంది. . (ఒక రోజు అటూ ఇటూ కావచ్చు) దక్షిణాయణం జూలై 17 నుండి జనవరి 14 వరకు వుంటుంది. (ఒక రోజు అటూ ఇటూ కావచ్చు)ఉత్తరాయణం లో లయ కారకుడైన పరమశివుడు మేలుకొని ఉంటాడు..ఈ కాలం లో వాతావరణం ఆహ్లాదకరం గా వుండడం వలనపుణ్య క్షేత్రాలు, తీర్ధ యాత్రలకు అనువుగా వుంటుంది....మనం ఉత్తర దిక్కునూ, ఉత్...